టీమిండియా మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన గాయం కారణంగా దూరమైంది. ప్రొటీస్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనున్నారు భారత అమ్మాయిలు.
ఆదివారం ప్రాక్టీస్లో మంధాన కాలివేళ్లకు గాయమైంది. అనంతరం చికిత్స చేసినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. ఈ కారణంగా వన్డే సిరీస్కు దూరం పెట్టనుంది జట్టు యాజమాన్యం. ఆమె స్థానంలో ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ను తీసుకునే అవకాశముంది.
మంధాన లేకపోవడం వల్ల కెప్టెన్ మిథాలీ రాజ్ యువ క్రికెటర్లకు చోటు కల్పించే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే సఫారీలపై టీ-20 సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా మహిళా జట్టు. వన్డే సిరీస్లోనూ సత్తాచాటాలనుకుంటోంది.
ఇదీ చదవండి: అశ్విన్ నా రికార్డు బ్రేక్ చేస్తాడేమో: భజ్జీ