మున్సిపాలిటీ ఎన్నికల వివాదంపై మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో మరోసారి కౌంటరు దాఖలు చేసింది. చట్ట ప్రకారమే అనుసరిస్తున్నామని... అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంటూ గతంలో కౌంటరు దాఖలు చేసింది. కౌంటరు గందరగోళంగా ఉందన్న హైకోర్టు... ఆధారాలతో పాటు సమగ్రంగా సమర్పించాలని గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్కారు ఇవాళ మరోసారి కౌంటరు దాఖలు చేసింది. వాదనల కోసం తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: కానిస్టేబుల్ను కారుపై 2.5 కి.మీ ఈడ్చుకుంటూ...