ఘంటశాలలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పర్యటన

author img

By

Published : Sep 8, 2019, 9:55 PM IST

గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని మోదీ స్ఫూర్తితో స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని చేపట్టిన స్వచ్ఛంద కార్యకర్తలు... ఘంటశాలలో పర్యటించారు. రోడ్లు శుభ్రపరిచి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఘంటశాలలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పర్యటన

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే నినాదంతో కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు నవంబర్ 12, 2014న స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమాన్ని చేపట్టారు. ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేస్తూ, ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా మారారు. ప్రారంభించిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ 1762 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఘంటశాలలోనూ స్వచ్ఛ ఘంటశాల కార్యక్రమాన్ని కొంత మంది ఔత్సాహికులు చేపట్టారు. దీనిని 2015లో ప్రారంభించగా ఇప్పటికీ 1438 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇవాళ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు ఘంటశాలలో పర్యటించారు. చల్లపల్లి నుంచి పాదయాత్రగా బయలుదేరి ఘంటశాలకు చేరుకున్నారు. ప్రధాన కూడలిలో, ఆలయం ముందు చెత్తను స్వచ్ఛ ఘంటసాల కార్యకర్తలతో కలసి శుభ్రపరిచి ప్రజలకు అవగాహన కల్పించారు.

Intro:చిన్న వయసులోనే క్రమశిక్షణ ఆధ్యాత్మిక చింతన మంచి నడత బాలల్లో పెంపొందించేందుకు బాల వికాస కేంద్రాలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు


Body:విజయనగరం జిల్లాలో ఆదివారం బాలవికాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సత్యసాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పార్వతీపురం లోని కంచర వీధి సత్యసాయి మందిరం లో బాలవికాస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ముందుగా పిల్లలు సాయి పల్లకి ఊరేగించారు అనంతరం మందిరంలో తండ్రుల అర్చన అష్టోత్తరాలు తో పూజలు నిర్వహించారు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా బాల వికాస పిల్లలకు బహుమతుల ప్రధానం చేశారు రామానంద నగర్ కృష్ణ పల్లి కొత్తవలస తదితర ప్రాంతాల బాల వికాస కేంద్రాల నిర్వాహకులు పిల్లలు సత్యసాయి సమితి సభ్యులు పాల్గొన్నారు


Conclusion:సాయి పల్లకి ఊరేగిస్తున్న చిన్నారులు తండ్రుల అర్చనలో పాల్గొన్న పిల్లలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.