కారుతో ఢీ కొట్టి.. ఆటోలో వెళ్లిపోయిన... ఆ ఎమ్మెల్యే.. !

author img

By

Published : Jun 13, 2019, 1:50 PM IST

Updated : Jun 14, 2019, 7:11 AM IST

తన వాహనం ఓ వ్యక్తిని ఢీ కొట్టినా పట్టించుకోలేదు. ఓ వ్యక్తికి గాయమైనా చలించలేదు. కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నమూ చేయలేదు. ఏదీ జరగనట్టుగా.. ఎంచక్కా ఆటోలో అసెంబ్లీకి వెళ్లిపోయారు.. ఆ మహిళా ఎమ్మెల్యే.

యువకుడ్ని ఢీ కొట్టి... అసెంబ్లీకి చిలకలూరి పేట ఎమ్మెల్యే

ఓ కొత్త ఎమ్మెల్యే కారు.. ఓ యువకుణ్ని ఢీ కొట్టింది. అసెంబ్లీకి వెళ్లే హడావుడిలో వేగంగా వెళుతున్న మహిళా ఎమ్మెల్యే వాహనం.. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోకుండా తన దారిన తాను ఆటోలో అసెంబ్లీకి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగితే ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని తీరుపై గ్రామస్థులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఉండాల్సింది పోయి.. కనీసం మానవత్వం లేకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో విస్తుపోయిన జనం.. ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. .

ఇదీ చదవండి

అధికారపక్షం సభా సంప్రదాయాలను విస్మరించింది: చంద్రబాబు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప

AP_CDP_26_13_RTC_SAMBARALU_C3


Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో కడప జిల్లా మైదుకూరులో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు చేసుకున్నారు ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి నాగరాజు నాయకత్వంలో లో డిపో for వద్దకు చేరుకున్న కార్మికులు బాణాసంచా పేల్చి ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు జై జగన్ జైజై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు


Conclusion:
Last Updated :Jun 14, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.